Friday, May 3, 2024

జ్ఞానవాపిలో త్రిశూలం ఎందుకుంది..?

తప్పక చదవండి
  • అక్కడ జ్యోతిర్లింగం కూడా ఉంది..
  • ముస్లింలు రాజీ ప్రతిపాదనతో రావాలి..
  • సంచలన వ్యాఖ్యలు చేసిన యూపి సిఎం యోగి..
  • యోగి న్యాయవ్యవస్థను అవమాన పడుతున్నాడు : అసదుద్దీన్..

వివాదాస్పద జ్ఞానవాపి మసీదులో త్రిశూలం ఉండటాన్ని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ప్రశ్నించారు. అది మసీదే అయితే అక్కడ త్రిశూలం ఎందుకుందని ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు. జ్ఞానవాపి ఆవరణ లోపల హిందూ ఆనవాళ్లు ఉన్నాయని చెప్పారు. ఒక చారిత్రకమైన తప్పిదం జరిగిందని ముస్లిం వర్గాలు అంగీకరించి ఒక ప్రతిపాదనతో ముందుకు రావాలని సూచించారు. జరిగిన తప్పిదం దిద్దుబాటు జరుగుతుందనే తాము నమ్మతున్నట్టు చెప్పారు. జ్ఞానవాపిని మసీదుగా పిలిస్తే, దీనిపై ఒక వివాదం కూడా ఉందని గుర్తించాలి. అదేమిటో చూడాలి. మసీదులో ఒక త్రిశూలంతో పనేంటి? అది మేము పెట్టినది కాదే? అక్కడ ఒక జ్యోతిర్లింగం కూడా ఉంది. దేవతల విగ్రహాలు కూడా ఆలయ ఆవరణలో ఉన్నాయి. ఒక చారిత్రక తప్పిందం జరిగిందనే విషయాన్ని ముస్లిం కమ్యూనిటీ గుర్తించి ఒక ప్రతిపాదనతో ముందుకు రావాలి. తప్పిదం జరిగినప్పుడు దానిని సరిద్దుదుకోవాలి. అది జరుగుతుందనే నమ్మకం మాకు ఉందని యోగి ఆదిత్యనాథ్‌ ఆ ఇంటర్వ్యూలో తెలిపారు. వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో ఏఎస్‌ఐ సర్వేకు సంబంధించి అలహాబాద్‌ హైకోర్టు ఆగస్టు 3న కీలక తీర్పు చెప్పనున్న నేపథ్యంలో యోగి ఈ వ్యాఖ్యలు చేశారు. కాశీవిశ్వనాథ ఆలయాన్ని కూల్చి దానిపై జ్ఞానవాపి మసీదు కట్టారని హిందూ వర్గాలు ఆరోపిస్తుండగా, ఈ వాదనతో ముస్లిం కమ్యూనిటీ విభేదిస్తోంది. యోగి ఆదిత్యనాథ్‌ వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. అలహాబాద్‌ హైకోర్టు త్వరలోనే తీర్పునిస్తుందని, ఆలోగా యోగి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం న్యాయవ్యవస్థను ధిక్కరించడమే అవుతుందని అన్నారు. ’జ్ఞానవాపి మసీదులో సర్వేని ముస్లింలు వ్యతిరేకిస్తున్నారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కి తెలుసు. అలహాబాద్‌ హైకోర్టులో దీనిపై విచారణ జరుగుతోంది. మరి కొద్ది రోజుల్లోనే తీర్పు వస్తుంది. అయినా యోగి ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కచ్చితంగా న్యాయవ్యవస్థ ధిక్కారం కిందకే వస్తుందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు