Friday, May 3, 2024

కొచ్చిలో 3వ జీ 20 ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ సమావేశం

తప్పక చదవండి

భారతదేశం యొక్క జీ 20 ప్రెసిడెన్సీ కింద, 3వ ఫ్రేమ్‌వర్క్ వర్కింగ్ గ్రూప్ 2023 జూన్ 13-14 వరకు కేరళలోని కొచ్చిలో సమావేశమవుతోంది. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముఖ్య ఆర్థిక సలహాదారు డాక్టర్ వి.అనంత్ నాగేశ్వరన్, ట్రెజరీ డిప్యూటీ డైరెక్టర్ టామ్ హెమింగ్‌వే అధ్యక్షత వహించారు. ప్రస్తుత ఔచిత్యానికి సంబంధించిన ప్రపంచ స్థూల ఆర్థిక సమస్యలపై సమావేశం దృష్టి సారించింది. సమావేశం యొక్క మొదటి సెషన్‌లో, జీ 20, వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ప్రస్తుత ప్రపంచ ఆర్థిక దృక్పథంపై వివరణాత్మక చర్చలు జరిపారు. జీ – 20 సభ్య దేశాలు, ఆహ్వానించబడిన దేశాలు, వివిధ అంతర్జాతీయ, ప్రాంతీయ సంస్థల నుండి 75 మంది ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు