అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ తదితర విభాగాలలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(ఐపీపీబీ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు: 43.. పోస్టులు: ఎగ్జిక్యూటివ్.. విభాగాలు: అసోసియేట్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ ఐటీ తదితరాలు.. అర్హతలు : బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.. జీతం : నెలకు రూ.10,00,000 నుంచి రూ.25,00,000 వరకు. ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ఫీజు: రూ.750. దరఖాస్తు : ఆన్లైన్.. చివరి తేది: జూలై 03.. వెబ్సైట్ : www.ippbonline.com