Sunday, May 5, 2024

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుంది – కూన శ్రీశైలం గౌడ్.

తప్పక చదవండి

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో అన్ని రంగాల్లో దేశం ప్రగతి సాధించిందని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ పాలన తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్బంగా మహా జన సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం షాపూర్ నగర్ హెచ్ఎంటి సొసైటీ లో బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ బుచ్చిరెడ్డి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ 8 డివిజన్ ల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే, బీజేపి రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ హాజరై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసారు. ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నాయకత్వం లో దేశం ఎంతో ప్రగతి సాధించిందని, ప్రతిపక్షాలు ఓర్వలేకే విమర్శలు చేస్తున్నాయని అన్నారు. కేంద్ర పథకాలను ప్రజలకు చేరకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకొంటుందని అన్నారు. కేంద్ర పథకాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, నాయకులు ఎంఎస్ వాసు, గరిగె శేఖర్, బావిగడ్డ రవి, చండి శ్రీనివాస్, పత్తి రఘుపతి, లక్ష్మిపతి రాజు, గడ్డం రాజేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పున్నారెడ్డి, దుర్యోధన్ రావ్, కంది శ్రీరాములు, పత్తి సతీష్, ఇంచార్జులు రాజిరెడ్డి, బిల్లా, సుశాంత్, వివిధ మోర్చాల నాయకులు, డివిజన్ నాయకులు, శక్తి కేంద్ర ఇంచార్జులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు