Tuesday, May 7, 2024

విమలక్కపై పెట్టిన అక్రమ కేసులు ఉపసంహరించుకోవాలి : బోళ్ల కొండల్ రెడ్డి

తప్పక చదవండి


రాజాపేట జూన్ 27 ( ఆదాబ్ హైదరాబాద్ ) :
అరుణోదయ కళాకారుని ప్రజా ఉద్యమ పోరాట వనిత విమలక్క పై ములుగు పోలీసులు పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకుడు మాజీ సర్పంచి బోళ్ల కొండల్ రెడ్డి అన్నారు. రాజాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలే కరుల సమావేశంలో మాట్లాడుతూ ములుగు జిల్లాలో విమలక్క పై కేసు పెట్టడం సరైన చర్య కాదని ప్రజా ఉద్యమకారులపై ప్రభుత్వ చర్య అణిచివేత ధోరణిలా ఉందని తెలిపారు. విమలక్క తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రజా సంఘాలతో కలిసి తన పాటలతో ప్రజలను ఎంతో చైతన్య పరిచి ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన వంతు కృషి చేశారని గుర్తు చేశారు. ఇలాంటి విమలక్క తో పాటు పలువురు పై పెట్టిన కేసులను ప్రభుత్వం కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు