Monday, April 29, 2024

అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా తెలంగాణ అభివృద్ధి..

తప్పక చదవండి

అమరవీరుల త్యాగాల స్ఫూర్తిగా నేడు కేసీఆర్ తెలంగాణాను అభివృద్ధి చేస్తున్నాడు అన్నారు హైకోర్టు సీనియర్ న్యాయవాది, బిఆర్ ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకురాలు, రాష్ట్ర అధ్యక్షులు బీసీ మహిళా సంక్షేమ సంఘం.గుండ్రాతి శారదాగౌడ్.. దశాబ్ది ఉత్సవాలలో భాగంగా గురువారం రోజ్ అమరవీరులకు జోహార్లు అర్పిస్తూ నాడు కస్టపడి, ఇష్టపడి, పోరుబడి తెచ్చుకున్న తెలంగాణా నీళ్ళు, నిధులు, నియామకాలు, నేడు కెసిఆర్ అదే స్ఫూర్తినీ కొనసాగిస్తూ ప్రాజెక్టులు నెలకొల్పి రైతు రాజ్యం చేసిండు.. ఐటీ హబ్ లు పెట్టి 9లక్షల మందికి కొలువులు చేసిండు.. కేంద్రం తొండి ఆట ఆడినా కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు కోసం నిధులకు కొరత రాకుండా, సంక్షేమ పథకాలు ఆగకుండా కొనసాగిస్తూ.. నిరంతరం తెలంగాణా అభివృద్ధి, సంక్షేమం రెండింటికి సమాన ప్రాముఖ్యత నిస్తూ.. తెలంగాణా రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రంగా చేసిండు.. అన్నపూర్ణగా తీర్చి దిద్దాడు సీఎం కెసిఆర్ అన్నారు శారదాగౌడ్.. ఈ కార్యక్రమంలో సురేష్ కుమార్, సునీత, విజయలక్ష్మి గౌడ్, మీరా, శామల, ఎల్లమ్మ, శోభ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు