Saturday, July 27, 2024

అఖిల భారత యాదవ మహాసభ సిద్దిపేట జిల్లా యాదవ విద్యార్థివిభాగం అధ్యక్షులు గా పయ్యావుల శ్యామ్ యాదవ్ నియామకం..

తప్పక చదవండి

సోమవారం రోజు అఖిల భారత యాదవ మహాసభ సిద్దిపేట జిల్లా కార్యాలయంలోరాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ సమక్షంలో, జిల్లా అధ్యక్షులు మామిండ్ల ఐలయ్య యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోచబోయిన శ్రీహరి యాదవ్ మాట్లాడుతూ.. యాదవులు విద్యాపరంగా ఇప్పటికి అత్యధిక డ్రాపౌట్స్ తో, వెనుకబడి ఉన్నారని, వారికి కెరీర్ గైడెన్స్ అందిస్తూ అదునాతన, శాస్త్ర, సాంకేతిక, నైపుణ్యం తో కూడిన ఉన్నత విద్య అందుకునేలా మన విద్యార్థి విభాగం ప్రోత్సహించాలన్నారు. పయ్యావుల శ్యామ్ యాదవ్ మంచి అంకితబావం ఉన్న ఉన్నత విద్యావంతుడు, 2006నుండి తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన నికర్సయ్న ఉద్యమకారుడని, ఇటీవలే రాష్టంలో నే ప్రప్రథమంగా పెద్దల ఆదేశంతో సిద్దిపేట లో పదవతరగతి లో 10 జీపీఏ సాధించిన యాదవ విద్యార్థులకు ప్రోత్సాహం, వారి తల్లితండ్రులకు సత్కారం కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం అభినందనీయం అన్నారు..

భవిష్యత్తులో మరిన్ని ఆదర్శపూరిత కార్యక్రమాలు చేపట్టి, అందరినీ సమన్వయము చేస్తూ, పెద్దల సహకారంతో ముందుకు పోవాలని రాష్ట్ర కమిటీ ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయాన్నారు.. ఈ కార్యక్రమంలోసిద్దిపేట పట్టణ అధ్యక్షులు పయ్యావుల ఎల్లం యాదవ్, జాతీయ కౌన్సిల్ సభ్యులు, పయ్యావుల రాములు యాదవ్, సిద్దిపేట అర్బన్ మండల అధ్యక్షులు చింతల కుమార్ యాదవ్, జిల్లా యువత అధ్యక్షులు బొల్లు రాము యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు అయితం రాజు యాదవ్, జిల్లా కార్యదర్శి ఎద్దు యాదగిరి యాదవ్, జిల్లా యువత నాయకులు చింతల సంతోష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు