Wednesday, May 22, 2024

టైటానిక్ శిథిలాలను చూసేందుకు వెళ్లిన టూరిస్ట్ సబ్ మెరైన్ గల్లంతు..

తప్పక చదవండి

సముద్రంలో ఉన్న టైటానిక్ మహానౌక శకలాలను చూసేందుకు వెళ్లిన ఓ జలాంతర్గామి గల్లంతయ్యింది. అట్లాంటిక్ మహా సముద్రంలో ఆచూకీ లేకుండా పోయింది. ప్రమాద సమయంలో సదరు జలాంతర్గామిలో ముగ్గురు పర్యాటకులతో పాటు ఇద్దరు సిబ్బంది ఉన్నట్లు సమాచారం. జలాంతర్గామితో కమ్యూనికేషన్ కట్ అయిన విషయం తెలియడంతో అమెరికా, కెనడాకు చెందిన రక్షణ బృందాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. గల్లంతైన టైటానిక్ పర్యాటక జలాంతర్గామిలో 70 గంటలకు స‌రిప‌డ మాత్ర‌మే ఆక్సిజ‌న్ ఉంద‌ని అధికారులు తెలిపారు. మిస్సైన జలాంతర్గామి కోసం గాలింపు చేపట్టినట్లు వెల్లడించారు.

1912లో అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయిన టైటానిక్ షిప్ శిథిలాలను దగ్గరి నుంచి చూపించేందుకు అమెరికాకు చెందిన ఓషియన్ గేట్ ఎక్స్ పెడిషన్స్ అనే టూరిజం కంపెనీ ఈ టూర్ లను నిర్వహిస్తోంది. దీనికోసం చిన్నపాటి జలాంతర్గామిని వినియోగిస్తోంది. ఈ జలాంతర్గామిలో ముగ్గురు గెస్టులు, ఒక పైలట్, మరో నిపుణుడు.. మొత్తం ఐదుగురు ప్రయాణించే వీలుంది. 22 అడుగులు పొడవున్న ఈ మినీ జలాంతర్గామి 10,431 కిలోల బరువు ఉంటుంది. ఇది 4,000 మీటర్ల లోతు వరకు వెళ్లగలదు. కాగా టైటానిక్ శకలాలను చూసేందుకు వెళ్లే ఈ యాత్ర టికెట్ ధర 2.50 లక్షల డాలర్లు. అంటే మన కరన్సీ ప్రకారం రూ.2కోట్లకు పైమాటే. ఈ యాత్రలో భాగంగా 400 మైళ్ల దూరం ప్రయాణిస్తారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు