Saturday, July 27, 2024

ప్రొ పంజా లీగ్‌ షురూ..

తప్పక చదవండి
  • ఆరంభ మ్యాచ్‌లో కిరాక్‌ హైదరాబాద్‌కు నిరాశ
  • ప్రొ పంజా లీగ్‌ తొలి సీజన్‌

ప్రొ పంజా లీగ్‌ (ఆర్మ్‌ రెజ్లింగ్‌) తొలి సీజన్‌ శుక్రవారం న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో అట్టహాసంగా మొదలైంది. కేంద్ర మంత్రి, మాజీ క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు పోటీలను అధికారికంగా ఆరంభించారు. ప్రొ పంజా లీగ్‌ నిర్వాహకులు ప్రితీ జింఘానియా, పర్వీన్‌ దబాస్‌ సహా ప్రాంఛైజీ యజమానులు ఆరంభ వేడుకల్లో పాల్గొన్నారు. తొలి రోజు పోటీల్లో తెలుగు జట్టు కిరాక్‌ హైదరాబాద్‌కు నిరాశే ఎదురైంది. లూథియాన లయన్స్‌తో పోరులో కిరాక్‌ హైదరాబాద్‌ 3-14తో పరాజయం పాలైంది. కిరాక్‌ హైదరాబాద్‌ తన తర్వాతి మ్యాచ్‌లో ఆదివారం బరోడా బాద్‌షాస్‌తో పోటీపడనుంది. అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో మూడింటా పరాజయాలు చవిచూసిన కిరాక్‌ హైదరాబాద్‌..మెయిన్‌ కార్డ్‌ మ్యాచుల్లో ఓ ఊరట విజయం సాధించింది. అండర్‌ కార్డ్‌ మ్యాచుల్లో తొలుత 70 కేజీల విభాగంలో షాహిల్‌ షా 1-2తో శివాన్షు కౌశి చేతిలో ఓటమి పాలయ్యాడు. 80 కేజీల విభాగంలో కాజి 0-1తో రాహుల్‌ కుమార్‌కు పాయింట్‌ను కోల్పోయాడు. 100 ప్లస్‌ కేజీల విభాగంలో లూథియాన లయన్స్‌ అఫ్జల్ ఖాన్‌ 1-0లో వినాయక్‌పై పైచేయి సాధించాడు.

ఇక మెయిన్‌ కార్డ్‌ మ్యాచుల్లో అక్సర్‌ అలీ మెప్పించాడు. 80 కేజీల విభాగంలో 3-1తో తేజాస్‌పై గెలుపొంది కిరాక్‌ హైదరాబాద్‌ సీజన్లో బోణీ కొట్టాడు. 70 కేజీల విభాగంలో స్టీవ్‌ థామస్‌ 0-5తో శివాజిత్‌ చేతిలో చిత్తయ్యాడు. 60 కేజీల విభాగంలో షోయబ్‌ అక్తర్‌ సైతం 0-5తో సచిన్‌ చేతిలో మట్టికరిచాడు.
ఓవరాల్‌గా ఆరు మ్యాచుల్లో (మూడు అండర్‌ కార్డ్‌, మూడు మెయిన్‌ కార్డ్‌) ఒక్క దాంట్లోనే గెలుపొందిన కిరాక్‌ హైదరాబాద్‌ 3-14తో లూథియాన లయన్స్‌కు ఆరంభ మ్యాచ్‌ను కోల్పోయింది.

- Advertisement -

ఆరు జట్లు పోటీపడుతున్న ప్రొ పంజా లీగ్‌ తొలి సీజన్‌ ఫైనల్స్‌ ఆగస్టు 13న జరుగనున్నాయి. లీగ్‌ దశలో డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ పద్దతిలో మ్యాచులు ముగిసిన అనంతరం పాయింట్ల పట్టికలో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు