బ్యాంక్ ఆఫ్ ఇండియా(బీవోఐ)..డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఏడాది కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతానికి పెంచింది. రూ.2 కోట్ల లోపు డిపాజిట్లకు మాత్రమే ఈ పెంపు వర్తించనున్నదని పేర్కొంది. దీంతోపాటు ఏడు రోజుల నుంచి పదేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై బ్యాంక్ 3 నుంచి 7 శాతం వరకు వడ్డీని చెల్లిస్తున్నది. సీనియర్ సిటిజన్లకు 7.50 శాతం, సూపర్ సీనియర్ సిటిజన్లకు(80 ఏండ్లు పైబడిన వారికి) 7.65 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నది బ్యాంక్.