న్యూ ఢిల్లీ : భారత స్టార్ పేసర్ యజ్వేంద్ర చాహల్ కు ప్రపంచ కప్ స్వ్వాడ్, ఆసియా కప్ స్వ్వాడ్ లో చోటు దక్కని విషయం తెలిసిందే. దాంతో, తీవ్ర నిరాశకు గురైన చాహల్ కౌంటీల్లో ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ లెగ్ స్పిన్నర్ త్వరలోనే కెంట్ జట్టు తరఫున నాటింగ్హమ్షైర్ పై తొలి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ విషయాన్ని కెంట్ క్రికెట్ అధికారికంగా వెల్లడించింది. ఈ సందర్భంగా చాహల్ భార్య ధనశ్రీ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘నిన్ను చూసి ఎప్పుడూ గర్వపడతాను. నువ్వు మా లెజెండ్’ అని ఆమె అంది. వరల్డ్ కప్ జట్టులో లేకపోవడంతో ఇకపై చాహల్ టెస్టులపై దృష్టి పెట్టనున్నాడని సమాచారం.