Saturday, July 27, 2024

గ్రామపంచాయితీ కార్మికులను క్రమబద్దికరించాలి

తప్పక చదవండి
  • రిటైర్డ్ ఐ.ఏ.ఎస్ చొల్లేటి ప్రభాకర్

రాష్ట్రవ్యాప్తంగా గత 22 రోజులుగా గ్రామపంచాయితీ కార్మికులు తమ హక్కుల కోసం సమ్మె చేస్తున్నారని ప్రభుత్వం వారి పట్ల సానుకూలంగా స్పందించాలని రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెవిపిఎస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గ్రామపంచాయితీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని స్థానిక నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్ లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా రిటైర్డ్ ఐఏఎస్ చొల్లేటి ప్రభాకర్ మాట్లాడుతూ గత 22 రోజులుగా 12,700 మంది గ్రామపంచాయితీ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నా మూలంగా గ్రామాలలో అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడిందన్నారు. ప్రభుత్వం స్పందించి వారిని చర్చలకు పిలువాలన్నారు. పంచాయితీ కార్మికులు గొంతమ్మ కోరికలు కోరడం లేదు అన్నారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం వారు చేస్తున్న పనికి తగ్గట్లుగా వేతనం ఇవ్వాలని కోరుతున్నారన్నారు. మల్టీపర్పస్ పేరుతో కార్మికులను ఇష్టారాజ్యంగా వాడుకొవడం రాజ్యాంగ నియమ నిబంధనలకు వ్యతిరేకమన్నారు.ఆ విధానాన్ని రద్దు చేయాలని కోరుతున్నాం అన్నారు.. పల్లెలను నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతున్న గ్రామపంచాయితీ కార్మికులు అతి తక్కువ వేతనానికి సకల పనులు చేయించడం వెట్టిచాకిరి కాదా అన్నారు. గ్రామ స్వరాజ్యం వెల్లువిరిసాలంటే గ్రామపంచాయతీ కార్మికులను హక్కున చేర్చుకోవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వారిని పర్మినెంట్ చేసి బాధ్యతాయుతమైన ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.

- Advertisement -

కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున మాట్లాడుతూ పంచాయితీ కార్మికులు గొంతమ్మ కోరికలు కోరడం లేదన్నారు.వారి న్యాయమైన డిమాండ్లు ఐన కార్మికులు, సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాలని, ప్రత్యేక బడ్జెట్‌ కేటాయించి ట్రెజరీ ద్వారా వేతనాలు ఇవ్వాలని,పీఆర్‌సీలో నిర్ణయించిన ప్రకారం నెలకు 19 వేల వేతనం చెల్లించాలన్నారు.జీఓ 51ని సవరించి మల్టీపర్సస్‌ వర్కర్‌ విధానాన్ని రద్దు చేయాలన్నారువిధి నిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలన్నారు.8 గంటల పనిదినాలు అమలు చేయాలన్నారు.పండుగ సెలవులు, వారాంతపు సెలవు, జాతీయ అర్జిత సెలవులు అమలు చేయాలన్నారు
సిబ్బందిపై వేదింపులు, అక్రమ తొలగింపులు ఆపాలన్నారు.

ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ రిటైర్డ్ ఏ.ఎస్.డబ్ల్యూ కత్తుల శశాంక్,యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సైదులు, డిటిఎఫ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.వెంకులు కుర్షిద్ మియా, తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు పందుల సైదులు, పివైఎల్ రాష్ట్ర అధ్యక్షులు ఇందూరి సాగర్, ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బిక్షపతి, ఐద్వా జిల్లా కార్యదర్శి పాలడుగు ప్రభావతి, ఉమారాణి, భూతం అరుణ, మాలల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు అద్దంకి రవీందర్, వృత్తిదారుల సంఘం జిల్లా కన్వీనర్ గంజి మురళి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బొంగరాల నరసింహ, గాదె నరసింహ, కొండా వెంకన్న, పోలే సత్యనారాయణ, బొల్లు రవీందర్ ఒంటెపాక యాదగిరి, పరిపూర్ణాచారి తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు