Saturday, May 18, 2024

కేరళలో మరోసారి బయటపడిన మహమ్మారి..

తప్పక చదవండి
  • బ్రెయిన్ ఇన్ఫెక్షన్ కారణంగా 15 ఏళ్ల బాలుడు మృతి..
  • అప్రమత్తమై ప్రజలకు హెచ్చరికలు చేసిన ప్రభుత్వం..
  • ఇది అత్యంత భయంకర ఇన్ఫెక్షన్ అంటున్న డాక్టర్లు..

కేరళ ప్రజలను ఇప్పుడు మరో అరుదైన వ్యాధి తీవ్ర భయాందోళనలకు గురి చేస్తోంది. అరుదైన బ్రెయిన్‌ ఇన్ఫెక్షన్‌ కారణంగా 15 ఏళ్ల బాలుడు చనిపోవడంతో స్థానికులకు ప్రభుత్వం అప్రమత్తం చేసింది. ఈ ఘటనతో కేరళ ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఈ వ్యాధి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తోంది. వర్షాకాలం నేపథ్యంలో కలుషితమైన నీటిలో స్నానం చేయ వద్దని కేరళ వాసులకు సూచించింది. తాజా ఘటనతో ఇదే అరుదైన వ్యాధి సోకి కేరళలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

అలప్పుజ జిల్లా పనవల్లికి చెందిన 15 ఏళ్ల బాలుడు ఇటీవల మృతి చెందాడు. ఆ బాలునికి ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌ – పీఏఎమ్‌ అనే అరుదైన బ్రెయిన్ ఇన్ఫెక్షన్ సోకిందని కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు. అయితే ఈ వ్యాధి సోకి ఇప్పటి వరకు కేరళలో చనిపోయిన వారి సంఖ్య ఆరుకు చేరుకున్నట్లు మంత్రి తెలిపారు. 2016 లో ఈ ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌ వ్యాధి తొలిసారి అలప్పుజ జిల్లాలో వెలుగు చూసిందని ఆమె పేర్కొన్నారు. ఆ సమయంలో ఈ వ్యాధితో ఒకరు చనిపోయినట్లు తెలిపారు. ఆ తర్వాత 2019 లో మలప్పురం జిల్లాలో ఇదే వ్యాధితో మరో వ్యక్తి మృతి చెందినట్లు చెప్పారు. ఇక 2020 లో కోజికోడ్‌ జిల్లాలో ఒకటి.. మలప్పురం జిల్లాలో మరొకటి.. 2022 లో త్రిశూర్‌లో ఒక మరణం నమోదైనట్లు వెల్లడించారు. దీంతోపాటు ఇప్పటివరకు ఈ వ్యాధి సోకిన వారందరూ చనిపోయారని తెలిపారు. ఈ ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌లో మరణాల రేటు 100 శాతంగా ఉందని మంత్రి వీణా జార్జ్ వెల్లడించారు.

- Advertisement -

అసలు ఏంటీ ఈ ఇన్ఫెక్షన్‌..?
ఈ ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌కు సంబంధించి వైద్య నిపుణులు కొన్ని విషయాలు వెల్లడించారు. ఇది కలుషితం అయిన నీటిలో స్వేచ్ఛగా తిరిగే అమీబా కారణంగా సోకుతుందని చెప్పారు. ఈ ఇన్ఫెక్షన్ మొదట ముక్కులోకి ప్రవేశించి.. అక్కడి నుంచి మెదడుకు చేరుతుందని అమెరికాకు చెందిన సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ – సీడీసీ వెల్లడించింది. మెదడులోకి చేరిన తర్వాత అక్కడి ముఖ్యమైన భాగాలపై దాడి చేస్తుందని.. దీని వల్ల నాడీ వ్యవస్థ దెబ్బ తింటుందని సీడీసీ తెలిపింది. దాంతో ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌ వ్యాధి వస్తుందని పేర్కొంది. ఈ ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌ సోకిన వారికి భరించలేని తలనొప్పి వస్తుందని.. ఇదే మొదటి లక్షణమని తెలిపింది. ఆ తర్వాత మానసిక సంతులత దెబ్బతినడం, భ్రాంతికి గురవడం వంటి అనారోగ్య సమస్యలు మొదలవుతాయని వెల్లడించింది.

ఎక్కడెక్కడ వెలుగు చూసింది..?
అయితే ఈ ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌ ఇన్ఫెక్షన్ గతంలో దక్షిణాఫ్రికాలోనూ వెలుగు చూసిందని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది అంటు వ్యాధి కాదని వైద్యులు తేల్చారు. దీంతో వేగంగా వ్యాప్తి చెందకుండా ఉంటుందని చెప్పడం కాస్త ఊరట కలిగిస్తోంది. అయితే ఇప్పటి వరకు ప్రభావవంతమైన ఔషధం అందుబాటులో లేదని సీడీసీ చెప్పింది. ఇప్పటికే ఉన్న కొన్ని రకాల ఔషధాల సమ్మేళనాలతో తాత్కాలికంగా చికిత్స అందిస్తున్నారని వివరించింది. ఈ ప్రైమరి అమీబిక్‌ మెనింజో ఎన్‌సైఫలిటిస్‌ ఇన్ఫెక్షన్ దృష్ట్యా కేరళ వైద్యారోగ్య శాఖ ప్రజలను అప్రమత్తం చేసింది. వర్షాకాలం నేపథ్యంలో కలుషితమైన నీటిలో స్నానాలు చేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు