Saturday, July 27, 2024

బీ.ఎల్‌.ఓ.లకు ప్రత్యేక తర్ఫీదు అందించాలి

తప్పక చదవండి
  • బీ.ఎల్‌.ఓ.ల పాత్ర కీలకం..
  • జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావ్‌
    సూర్యాపేట: జిల్లాలో బి.ఎల్‌.ఓ లు ఎన్నికల నియమ నిబంధనలపై పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ యస్‌. వెంకట్రావు అన్నారు. మంగళ వారం కలెక్టరేట్‌ లోని ఎన్నికల విది విధానాలపై జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌ తో నియోజక వర్గ స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌ లకు ఒక్క రోజు ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో అదనపు కలెక్టర్‌ యస్‌. మోహన్‌ రావుతో కలసి కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్‌ జాబితా తయారీలో బి.ఎల్‌.ఓ ల పాత్ర కీలకమైనదని అన్నారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఉన్న 1168 మంది బి.ఎల్‌.ఓ లకు ఈ నెల 19 నుండి 25 వరకు ఓటర్‌ జాబితా తయారి , మార్పులు, చేర్పులు అలాగే మరణించిన వారు, వలస వెళ్లిన వారి ఓట్లను పరిశీలించి తుది సమాచారం అందించుటలో కీలక పాత్ర పోషించే విదంగా శిక్షణా తరగ తులు చేపట్టాలని సూచించారు. ఆయా నియోజక వర్గంలో ఎన్నికల సందర్బంగా చేపట్టే కార్యక్ర మాల్లో వివిధ పార్టీల ప్రతినిధులకు సమాచారం అందించాలని సూచించారు. 80 సంవత్సరాలు దాటిన ఓటర్‌ యొక్క వివరాలను తప్పక సేకరించాలని ఆదేశించారు. ఫోటో ఎలెక్ట్రోల్‌ వచ్చిన తర్వాత ఎలాంటి పొరపాటు జరగకుండా ఎన్నిక ప్రక్రియ సక్రమంగా నిర్వహించడం జరుగుతుందని, ఎలక్ట్రోల్‌ సక్రమంగా నిర్వహించడం వలన గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ఓటు శాతం ఎక్కువగా పెరిగిందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఈ.సి.ఐ ఎన్నో మార్పులు చేసిందని తదనుగునంగా ఎన్నికల నియమ నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు. ఎన్నికలు సులువుగా నిర్వహించేందుకు ఓటర్‌ లిస్ట్‌ , పోలింగ్‌ కేంద్రాలు, పోలింగ్‌ పర్సన్స్‌, ఈవీఎం లు, వివిప్యాట్స్‌ అలాగే ఇతర సామగ్రి పై పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ శిక్షణ ద్వారా ప్రతి నియోజక వర్గంలో గల మండలాల వారీగా బి.ఎల్‌.ఓ లకు ప్రత్యేక తర్ఫీదు అందించాలని మాస్టర్‌ ట్రైనర్స్‌ లను కలెక్టర్‌ ఈ సందర్బంగా ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా స్థాయి మాస్టర్‌ ట్రైనర్స్‌ టి. సాయా గౌడ్‌, ఆర్‌. ఆమిన్‌ సింగ్‌, ఎన్నికల సిబ్బంది, ఏ.ఎల్‌.ఎం.టి లు తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు