రోజు రోజుకు ఆదిపురుష్ సినిమాపై అంచనాలు భారీగా పెరుగిపోతున్నాయి. మరో రెండు వారాల్లో విడుదల కానున్న ఈ సినిమాపై ప్రేక్షకులే కాదు సినీ సెలబ్రెటీలు సైతం అమితాసక్తితో ఎదురు చూస్తున్నారు. రామయణం ఇతిహాసం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. గతేడాది రిలీజైన టీజర్ తో చిత్రబృందం తీవ్రంగా ట్రోల్స్ కు గురైంది. గతేడాది చివర్లో విడుదలైన టీజర్ ఓ రేంజ్లో ట్రోల్స్కు గురైంది. దాంతో చిత్రయూనిట్ దెబ్బకు ఆరు నెలలు షూటింగ్ను వాయిదా వేసి మెరుగైన వీఎఫ్ఎక్స్ను తీర్చిదిద్దడంలో మునిగిపోయింది. ఇక ఇటీవలే విడుదలైన ట్రైలర్కు తిరుగులేని రెస్పాన్స్ వచ్చింది. టీజర్తో వచ్చిన నెగిటీవిటీ అంతా ట్రైలర్తో పటా పంచలయింది. మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై యావత్ సినీ ప్రేమికులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ రెండు వారాలు చిత్రయూనిట్ ప్రమోషన్లతో తెగ బిజీ కానున్నట్లు తెలుస్తుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ను జూన్ 6న తిరుపతిలో భారీ ఎత్తులో జరుపనున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. కాగా ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ ను ప్రీ రిలీజ్ వేడుకలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ట్రైలర్ కట్ కు సంబంధించిన పనులు కూడా పూర్తయినట్లు సమాచారం. మైథలాజికల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్ర పోషించగా.. కృతిసనన్ సీతగా కనిపించనుంది. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ లంకాధిపతి రావణాసురుడుగా కనిపించనున్నాడు. రెట్రో ఫైల్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు దాదాపు రూ.500 కోట్లు ఖర్చయింది. ఇక ఇప్పటికే ప్రొడ్యూసర్లకు థియేట్రికల్, నాన్ థియేట్రికల్ రూపంలో మొత్తం ముట్టాయని తెలుస్తుంది.