రాజకీయాన్నే వ్యాపారంగా మార్చుకున్న
నాయకులు.. విష రాజకీయ చదరంగాన్ని
సాగించినంత కాలం..
జనస్వామ్యంపై ధనస్వామ్యం
గెలిచినంత కాలం..
ప్రజాస్వామ్యం పవిత్రమైన పతితగా ప్రతీదినం
పతనమౌతుంది.
అమలు కాని ఆశయంలా అంగలారుస్తుంది.
మిగిలి పోయిన నిరాశలా
తిరిగి రాని స్వప్నంలా మారుతుంది.
- అల్లి ప్రవీణ్..