స్టార్ షట్లర్ పీవీ సింధు మళ్లీ రాకెట్ ఝుళిపించింది. ఇండోనేషియా ఓపెన్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో సింధు మంగళవారం తొలి రౌండ్లో స్థానిక క్రీడాకారిణి గ్రెగొరియా మరిస్క తన్జంగ్ను వరుస గేమ్లలో ఓడించి ప్రిక్వార్టర్కు చేరుకుంది. హెచ్.ఎస్.ప్రణయ్ కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రవేశించాడు. కాగా త్రిసా-గాయత్రి జోడి తొలి రౌండ్లోనే ఇంటిబాట పట్టారు....