Wednesday, April 24, 2024

ఫాక్స్ కాన్ కంపెనీ ఓ భారీ కుంభకోణం..

తప్పక చదవండి
  • 200 ఎకరాల భూమిని కాజేయడానికి కేటీఆర్ ఎత్తుగడ..
  • ఈ వ్యవహారంపై సీబీఐ కి ఫిర్యాదు చేసిన బక్కా జడ్సన్..
  • ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన డీపీఆర్ కూడా ప్రభుత్వం ఇవ్వలేదు..
  • పలు కంపెనీలకు క్విడ్ ప్రో స్కీమ్ కింద అనుమతులు ఇస్తోంది..

హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా కొంగర కలాన్ ఏర్పాటుకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేసిన ఫాక్స్ కాన్ కంపెనీ ఓ భారీ కుంభకోణం అని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఆరోపించారు. ఇదంతా 200 ఎకరాల భూమిని అక్రమంగా కాజేయడానికి సీఎం కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ వేసిన ఎత్తుగడ అని అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం సీబీఐకి ఫిర్యాదు చేశారు.

ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ ఇప్పటి వరకు ప్రభుత్వం ఇవ్వలేదని ఈ కంపెనీ వెనుక బీఆర్ఎస్ యూకే ఎస్ఆర్ఎస్ఐ సలహాదారుడు ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతను కేటీఆర్, కవితకు సన్నిహితుని ఎన్నికల ఏడాదిలో పలు కంపెనీలతో కుమ్మక్కై క్విడ్ ప్రో స్కీమ్ కింద ఈ ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తోందని ఆరోపించారు. 400 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న ఈ కంపెనీ 34,000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం చెబుతోందని కానీ ఈ సంస్థకు అంత సామర్థ్యం లేదని బ్యాంకులను మోసం చేయడాని ఇదంతా కుట్ర అని ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ ప్రభుత్వం బయట పెట్టడం లేదని అన్నారు. అసలు ఈ సంస్థ ఉత్పత్తుల విక్రయాలు, గత ఐదేళ్లుగా ఈ సంస్థ ఆర్థిక నివేదికలు, మొత్తం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు, ఆర్డీఓసీ, హైదరాబాద్ లో దాని రిజిస్ట్రేషన్, ఎన్ జీటీ అనుమతులు వంటి తదితర రికార్డులను పరిశీలించాలని సీబీఐని కోరినట్లు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు