- – యూకే లో రూ. 41 లక్షలకు పైగా అమ్ముడుపోయిన వైనం..
- న్యూఢిల్లీ, 12 మే (ఆదాబ్ హైదరాబాద్) : 1964లో రూ. 7వేలకి కొనుగోలు చేసిన రోలెక్స్ వాచ్.. ఇప్పుడు యూకే లో వేలంలో రూ. 41లక్షలకు పైగా అమ్ముడుపోయింది. రాయల్ నేవీలో పనిచేస్తున్న ఓ డ్రైవర్ అప్పట్లో ఈ వాచీని కొన్నారు. ఆయన కుమారుడు ఇప్పుడు ఆ వాచీని వేలం వేశారు. దాదాపు 60ఏళ్ల కింద కొన్న ఈ గడియారం రోలెక్స్ సబ్మారినర్ మోడల్కు చెందింది. ఈ వాచీని ద డ్రైవర్స్ వాచీ అని కూడా పిలుస్తారు. దీన్ని 1953లో లాంచ్ చేశారు. ఇది వాటర్ప్రూఫ్ కూడా. రాయల్ నేవీలోని రెస్క్యూ హెలికాప్టర్లలో పనిచేసే సైమన్ బార్నెట్ అనే ఓ డ్రైవర్ దీన్ని కొన్నారు. ఆయన 2019లో మరణించారు. ఇప్పుడు ఆయన కుమారుడు పీట్ బార్నెట్ ఈ వాచీని న సొంత పట్టణం నార్ఫోక్లోని డిస్స్లో వేలంలో అమ్మారు. నేవీలో పనిచేసిన తన తండ్రి డైవింగ్ సమయంలో ఈ వాచీని వాడినట్లు ఆయన స్పష్టం చేశారు. రెస్క్యూ హెలికాప్టర్లలో పనిచేసే సమయంలో సైమన్ బార్నెట్ కు ఈ రోలెక్స్ వాచ్ చాలా ఉపయోగపడేది. అతను ఎక్కువ భాగం నీటిలోనే ఉండాల్సి రావడంతో.. అతను నీటి కింద ఎంతసేపు ఉన్నాడో తెలుసుకోవడానికి ఇదే చక్కని సాధనంగా ఉపయోగపడేది. ఆ రోజుల్లో రోలెక్స్ వాచీని కేవలం ఫ్యాషన్ కోసమే కాకుండా.. సబ్మెరైనర్ పరికరంగానూ సహాయపడిందన్నమాట. తన తండ్రి చనిపోయాక ఈ వాచీని తాను అన్ని సందర్భాల్లోనూ ధరించేవాడినని, కానీ 60వేల పౌండ్ల (రూ.61లక్షలకు పైగా) విలువ గల సాధనం తన మణికట్టు దగ్గర పెట్టుకుని ఉండలేకపోయానని ఈ సందర్భంగా సైమన్ కుమారుడు పీట్ తెలిపారు.
తప్పక చదవండి
- Advertisement -