Friday, March 29, 2024

మా వ్యూహం మాకుంది..

తప్పక చదవండి
  • నోట్ల రద్దు అంశంపై ఆసక్తిర వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి..
  • అవినీతిపరులే రూ.2 వేల నోట్ల రద్దును వ్యతిరేకిస్తున్నారు..
  • ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ మా చేతుల్లో లేదు..
  • ఆధారాలున్నాయి కాబట్టే మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది..
  • ఫ్లెక్సీలు పెట్టించుకున్నంత మాత్రాన కేసీఆర్ దేశానికి నేత కాలేరు : కిషన్ రెడ్డి..

హైదరాబాద్ : రూ.2 వేల నోట్ల ఉపసంహరణను అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. ‘‘నోట్ల రద్దు విషయంలో మా ప్లాన్ మాకు ఉంది’’ అని చెప్పారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి పలు అంశాలపై స్పందించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పునకు ఎలాంటి అవకాశం లేదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై ప్రచారంలో ఉన్న వార్తలన్ని ఆధారం లేనివన్నారు. పార్టీలోని నేతలంతా ఒకే కుటుంబమని చెప్పుకొచ్చారు. జాతీయ నేతలను రాష్ట్ర నేతలు కలవటం సర్వసాధారణమైన విషయమని తెలిపారు. అయితే.. మిగతా పార్టీల నేతలు కావాలనే ఈ వార్తలను రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ లిక్కర్ స్కాంపై స్పందించిన కిషన్ రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనేది పార్టీ చేతుల్లో ఉండదని.. అది సీబీఐ పరిధిలోని అంశమని పేర్కొన్నారు. అన్ని ఆధారాలున్నాయి కాబట్టే.. ఢిల్లీ డిప్యూటీ సీఎంను సీబీఐ అరెస్ట్ చేసిందన్నారు. అవినీతికి పాల్పడితే ఎవ్వరినీ కేంద్రం వదిలిపెట్టదని తెలిపారు. ఈ క్రమంలోనే అవినీతికి పాల్పడిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యేను కూడా జైలుకు పంపించినట్టు చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో ఒక వార్డ్ మెంబర్ గెలిచినందుకే బీఆర్ఎస్ నేతలంతా తెగ సంబరపడిపోతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. రెండు వేల రూపాయల నోట్ల ఉపసంహరణను కేవలం అవినీతిపరులే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. నోట్ల రద్దు విషయంలో తమ ప్లాన్ తమకు ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి. మరోవైపు.. కర్ణాటక ఎన్నికల‌ ఎఫెక్ట్ ఇటు తెలంగాణలో ఏమాత్రం ఉండదని తేల్చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎలాంటి భవిష్యత్తు లేదని.. బీఆర్ఎస్‌కు కేవలం బీజేపీనే ప్రత్యామ్నాయమని కిషన్ రెడ్డి ఉద్ఘాటించారు. రాష్ట్రంలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని మోదీ పునరుద్ధరిస్తే.. ప్రారంభోత్సవానికి వచ్చే తీరిక కూడా సీఎం కేసీఆర్‌కు లేదని కిషన్ రెడ్డి విమర్శించారు. మహారాష్ట్రలో జరిగే సభలు, సమావేశాలకు వెళ్లేందుకు మాత్రం కేసీఆర్ చాలా సమయముందంటూ దుయ్యబట్టారు కిషన్ రెడ్డి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు