Wednesday, April 24, 2024

కాంగ్రెస్‌ హయాంలో అభివృద్ధి ఎక్కడ : మంత్రి హరీశ్‌ రావు

తప్పక చదవండి

కాంగ్రెస్‌ పార్టీ హయాంలో అభివృద్ధి శూన్యమని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో మూడు రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ పట్టణంలో ఆరెకటిక సంఘం నూతన భవనానికి మంత్రి హరీశ్‌ రావు శంకుస్థాపన చేశారు.

అనంతరం హరీశ్‌ రావు మాట్లాడుతూ.. ప్రజల మీద ప్రేమతో తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలను తీసుకొచ్చామని తెలిపారు. గతంలో జహీరాబాద్‌లో ట్యాంకర్లతో తాగు నీరు ఇచచేవారని.. కానీ సీఎం కేసీఆర్‌ ఆలోచనతో ఇంటింటికీ నల్లాలు పెట్టి నీళ్లు ఇస్తున్నామని అన్నారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించి మెరుగైన వైద్యం అందిస్తున్నాని చెప్పారు. జహీరాబాద్‌లో 50 పడకల ఎం.సి.హెచ్. హాస్పిటల్ నిర్మిస్తున్నామని అన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి గర్బిణులకు న్యూట్రిషన్‌ కిట్లు పంపిణీ చేస్తామని తెలిపారు. త్వరలోనే జహీరాబాద్‌లో 700 డబుల్‌ బెడ్‌రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తామని అన్నారు. సొంత జాగా ఉన్న వారికి ఇండ్ల నిర్మాణం కోసం రూ.3లక్షలు లబ్ధిదారుల ఖాతాలో వేయబోతున్నామన్నారు. అదే కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ప్రజలకు చేసిందేమీ లేదని మంత్రి హరీశ్‌ రావు ఎద్దేవా చేశారు. ఆ పార్టీ అధికారంలో ఉన్న కర్ణాటకలో రూ.600 పింఛన్‌ ఇస్తున్నారని.. తెలంగాణలో మాదిరిగా రూ.2వేల పింఛన్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 24 గంటల కరెంట్‌ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు