Friday, April 19, 2024

డిచ్‌పల్లి తెలంగాణ సంక్షేమ సంబరాల్లో ఎమ్మెల్సీ కవిత..

తప్పక చదవండి
  • త్వరలో తెలంగాణకు కొత్త పథకం రానుందని వెల్లడి..

హైదరాబాద్, 09 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
డిచ్‌పల్లి తెలంగాణ సంక్షేమ సంబరాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఏ ప్రభుత్వంలో అయినా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు చూడలేదు అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాష్ట్ర సంక్షేమ పథకాలకు ఎన్నో దేశ స్థాయి అవార్డులు వచ్చాయి.. కేసీఆర్ ప్రభుత్వం మహిళ బాధలను అర్ధం చేసుకుని ఒంటరి మహిళలకు ఆసరా పథకం అందించారు.. రాష్ట్రంలో 33 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి డయాలసిస్ బాధితులకు కేసీఆర్ అండగా నిలిచారు.. ఇల్లు, ఇళ్ల స్థలాలు లేనివారికి కేసీఆర్ త్వరలో మంచి పధకం తీసుకురానున్నారు.. ఎవరూ అడగకుండానే కంటి వెలుగుతో పాటు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసిఆర్ దే అన్నారు ఎమ్మెల్సీ కవిత..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు