Saturday, June 10, 2023

కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే..

తప్పక చదవండి
  • ఏం సాధించారని కేసీఆర్‌ దశాబ్ది ఉత్సవాలు…? ప్రజల్లో పేరున్న వారికే టికెట్లు..
  • సర్వే నివేదికలను ఆధారం చేసుకునే టిక్కెట్స్‌ ఇస్తాం..
  • తెలంగాణాలో బీజేపీయే బీ.ఆర్‌.ఎస్‌. కు పోటీ..
  • నాయకులు నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉండాలి..
  • కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యే దిక్కులు చూస్తున్నారు..
  • బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుబండి సంజయ్‌ కుమార్‌
  • హైదరాబాద్‌ లో ఘనంగా ప్రారంభమైన పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు

హైదరాబాద్‌ : నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఓటర్లను కలిసే నేతలకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వస్తుందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ లోని చంపాపేటలో సోమవారం బండి సంజయ్‌ అధ్యక్షతన ప్రారంభమైన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. పలు సర్వేలు నిర్వహించి, నివేదికల ఆధారంగానే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ లు ఇస్తామని ప్రకటించారు. ప్రజలంతా బీజేపీ మాత్రమే బీఆర్‌ఎస్‌ కు ప్రత్యామ్నాయం అవుతుందని నమ్ముతున్నారు. కాంగ్రెస్‌ లో ఉన్న 5 గురు ఎమ్మెల్యేల్లో నలుగురు నాలుగు దిక్కులు చూస్తూ నాలుగు స్థంభాలాట ఆడుతుంటే… ఒకాయన మాత్రం చౌరస్తాలో నిలబడి ఏం చేయాలో తెల్వక చూస్తున్నడు అని బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. తెలంగాణలో డబుల్‌ ఇంజన్‌ సర్కార్‌ రావాలని, అప్పుడే అన్ని కేంద్ర, సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతాయని చెప్పారు. మిషన్‌ భగీరథ పెద్ద స్కాం అని ఆరోపించారు. కేసీఆర్‌ సర్కార్‌ అక్రమాలు, అవినీతి, వైఫల్యాలపై బీజేపీ నిలదీస్తుంటే కేసీఆర్‌ ఓర్వలేకపోతున్నడు. ఒకనాడు మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇయాళ అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నడు. బీజేపీని ఓడిరచేందుకు దేశమంతా తిరుగుతూ పైసలు పంచుతున్నడు. కేసీఆర్‌ విశ్వాస ఘాతకుడిని నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు. కేసీఆర్‌ ఎంతటి విశ్వాసఘాతకుడంటే మొన్నటి కర్నాటక ఎన్నికల్లో జేడీఎస్‌ ను మోసం చేసిండు.. తెలంగాణ కోసం మొదటి నుండి నిలబడి కలబడి పార్లమెంట్‌ బిల్లు పాస్‌ చేయించిన సుష్మా స్వరాజ్‌ ను తెలంగాణ చిన్నమ్మ అని సంబోధించిన నోటితోనే దూషించారు. 2004లో కాంగ్రెస్‌ తో పొత్తుపెట్టుకుని ఆ పార్టీని, 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఆ తరువాత బయటకొచ్చి ఆ పార్టీని మోసం చేసిండు. 2004లో కమ్యూనిస్టు పార్టీలను తోక పార్టీలని, సూది దబ్బడం పార్టీలని తిట్టిన నోరే… ఇయాళ తన అవసరం కోసం కమ్యూనిస్టు పార్టీలను చంకనేసుకుని తిరుగుతున్నడు.. దేశాన్ని కాంగ్రెస్‌, నెహ్రూ కుటుంబం మోసం చేస్తే అవసరం తీరాక ఆ కాంగ్రెస్‌ ను, ఆ కుటుంబాన్ని మోసం చేసిన ఘనుడు కేసీఆర్‌… అంతెందుకు కర్నాటక ఎన్నికల దాకా జేడీఎస్‌ కు నిధులు పంపి జట్టు కట్టిన కేసీఆర్‌… ఆ వెంటనే ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్‌ తో జతకట్టారు.. తెలంగాణ కోసం బొంత పురుగున్కెనా కౌగిలించుకుంటానన్న కేసీఆర్‌ అసలు న్కెజం అది కాదు… తన స్వార్ధం కోసం, తన కుటుంబం ప్రయోజాల కోసం బొంత పురుగున్కెనా నమిలి మింగేసే రకం కేసీఆర్‌’ అని బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. లాఠీలకు భయపడకుండా కేసులకు బెదరకుండా ఉద్యమిస్తున్నది బీజేపీ. జ్కెళ్లకు పోతున్నది బీజేపీ. ప్రజలంతా ఇయాళ కేసీఆర్‌ ను ఢీ కొట్టేది బీజేపీయేనని భావనతో ఉన్నరు. బీజేపీ అధికారంలోకి వస్తేనే మేలు జరుగుతుందని నమ్ముతున్నరు. 2018 నుండి బీజేపీ గ్రాఫ్‌ పెరుగుతూ వస్తోంది. అందుకే గత మూడేళ్లుగా ఏ ఎన్నికలు జరిగినా బీజేపీని ఆదరిస్తూ వస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నిక నుండి మొదలు పెడితే… జీహెచ్‌ఎంసీ, హుజూరాబాద్‌, మునుగోడు, టీచర్‌ ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ప్రజలు బీజేపీవైపు నిలిచారు. ఎన్నికల ఫలితాల్లో డిపాజిట్లే రాని కాంగ్రెస్‌ పార్టీ ఏ విధంగా రాష్ట్రంలో ప్రత్యామ్నాయమవుతోందో ఆలోచించాలి’ అన్నారు బండి సంజయ్‌. బీజేపీని దెబ్బతీయాలని కంకణం కట్టుకున్న కేసీఆర్‌ కాంగ్రెస్‌, ఎంఐఎం, ఒక సెక్షన్‌ విరీడియాతో కలిసి కుట్ర చేస్తున్నడు. కర్నాటక ఎన్నికల ఫలితాలు రాంగనే తెలంగాణలో బీజేపీ పన్కెపోయిందని ప్రచారం చేస్తున్నయ్‌. విరీడియాలోని ఓ సెక్షన్‌ వీరికి వంతపాడుతూ బీజేపీలో చేరిన లీడర్లంతా కాంగ్రెస్‌ లోకి పోతున్నరని కథనాలు మొదలు పెట్టినయ్‌.. కర్నాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధమేంది? అక్కడ ఓడిపోతే ఇక్కడెం దుకు బీజేపీ బలహీనపడుతుందో రాజకీయ విశ్లేషకులు, జర్నలిస్టులు ఆలోచించాలి. శాసనసభ ఉప ఎన్నకలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలను బేరీజు వేసి వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు. కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటున్నడు. ఆ పార్టీకి సొంతంగా అధికారం రాదని తేలిపోవడంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులకు పాకెట్‌ మనీ పేరుతో ఎన్నికల ఫండిరగ్‌ చేస్తున్నడు. ఎందుకంటే కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిస్తే వాళ్లంతా బీఆర్‌ఎస్‌ తో కలిసి అధికారం పంచుకోవాలని చూస్తున్నరు. బీజేపీ సింగిల్‌ గా పోటీ చేస్తుంది. మెజారిటీ సాధిస్తుంది. అనుమానం లేదు. సినిమాల్లో గుర్తుండిపోయిన విలన్లు రావుగోపాలరావు, కైకాల సత్యనారాయణ, అల్లు రామలింగయ్య. రాష్ట్రంలో కేసీఆర్‌ మెయిన్‌ విలన్‌ అయితే కాంగ్రెస్‌, ఎంఐంఎం పార్టీలు సత్యనారాయణ, అల్లు రామలింగయ్య , కైకాల సత్యనారాయణ మిగతా విలన్లు అన్నారు. కమ్యూనిస్టులను ఆకు రౌడీల ట్కెపు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీళ్లంతా విలన్ల లాగ అడ్డుకుంటున్నా.. హీరోలెక్క టార్గెట్‌ చేస్తూ ప్రజలను కాపాడుకునేందుకు పోరాడుతోంది బీజేపీ. ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీని ఏవిరీ చేయలేరనే విషయాన్ని ప్రజలకు కూడా అర్ధమైందన్నారు’ బండి సంజయ్‌. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అహర్నిశలు క్రుషి చేస్తున్న నాయకులు, కార్యకర్తలందరికీ అభినందనలు. కేంద్ర ప్రభుత్వం 9 ఏళ్లలో చేపట్టిన కార్యక్రమాలను గ్రామగ్రామాన, గడప గడపకూ చేర్చాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను నిర్వహిస్తున్నాం.
ఈనెల 30 నుండి జూన్‌ 30 వరకు మహాజన సంపర్క్‌ అభియాన్‌ పేరుతో కేంద్ర పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించాం. దేశంతోపాటు తెలంగాణ అభివ్రుద్ధి కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతో క్రుషి చేస్తున్నా కేసీఆర్‌ ప్రభుత్వ మూర?త్వంతో అనుకున్న స్థాయిలో అభివ్రుద్ధి జరగడం లేదు. కేంద్రం చేపట్టిన కార్యక్రమాలను, ఇస్తున్న నిధులను ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లామని బండి సంజయ్‌ అన్నారు. అయితే నాకు బాధన్పించే విషయం ఒక్కటే… రైతులు, నిరుద్యోగులు, విద్యార్తులు, ఎస్సీ,ఎస్టీ, బీసీలుసహా తెలంగాణలోని నాలుగు కోట్ల మంది ప్రజలు బాధల్లో ఉన్నరు. కేసీఆర్‌ పాలన విరగడ కావాలని కోరుకుంటున్నరు. వాళ్లంతా ఆశగా బీజేపీవైపు ఎదురు చూస్తున్నరు. బీజేపీ సింహంలా సింగిల్‌ గానే కొట్లాడుతుంది. అధికారంలోకి వస్తుంది. బీజేపీ ఆధ్వర్యలో పేదల రాజ్యాన్ని స్థాపించడం ఖాయం అన్నారు.

- Advertisement -
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -spot_img

మరిన్ని వార్తలు

- Advertisement -spot_img