- పార్టీ కటౌట్లు కూడా కక్ష గట్టాయి.. తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించేదెవరు..
- అధికారుల నిర్లక్షమే ఈ నిర్వాకానికి కారణం..
హైదరాబాద్ : బీ.ఆర్.ఎస్. ప్రభుత్వమే కాదు.. చివరకు పార్టీ కటౌట్లు కూడా తెలంగాణ ప్రజలపై కక్ష గట్టాయి.. దీనికి ఉదాహరణ శనివారం జరిగిన సంఘటన.. అధికారుల నిర్లక్ష్యం వల్లే.. ఒక వ్యక్తికి ప్రాణాంతకంగా పరిణమించింది.. సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్ ముందు ఏర్పాటు చేసిన బీ.ఆర్.ఎస్. కటౌట్ అకస్మాత్తుగా రోడ్డుపై పడటంతో ప్రయాణికుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.. ప్రస్తుతం అతనికి చికిత్స జరుగుతోంది.. పోలీసులు జరిగిన ఉపద్రవం మీద దర్యాప్తు చేస్తున్నారు..