Thursday, April 25, 2024

ఏపీఎస్‌-గోల్కొండలో 18 టీచ‌ర్ పోస్టులు..

తప్పక చదవండి

సైకాలజీ, ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, సైన్స్‌, కంప్యూటర్స్‌, మ్యూజిక్‌ తదితర విభాగాల‌లో పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ పోస్టుల భర్తీకి గోల్కొండలోని ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌ (ఏపీఎస్‌) నోటిఫికేషన్ విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, బీఈఐఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంట‌ర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

మొత్తం పోస్టులు: 18.. పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్‌టీ.. విభాగాలు : సైకాలజీ, ఇంగ్లిష్‌, హిందీ, మ్యాథ్స్‌, సైన్స్‌, కంప్యూటర్స్ త‌దిత‌రాలు.. అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ, బీఈఐఈడీ, డీఈడీ, డీఈఐఈడీ, బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.. దరఖాస్తు ఫీజు: రూ.100.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో.. అడ్రస్ : ఆర్మీ పబ్లిక్‌ స్కూల్‌, గోల్కొండ, ఇబ్రహీంబాగ్‌ పోస్ట్‌ ఆఫీస్‌, సన్‌ సిటీ దగ్గర, హైదరాబాద్‌-500031. చివరి తేది: జూన్ 15
వెబ్‌సైట్ : https://www.apsgolconda.edu.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు