Friday, April 19, 2024

2018 చిత్రానికి బ్రహ్మరథం పడుతున్న తెలుగు ఆడియన్స్

తప్పక చదవండి

కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన 2018 చిత్రం నేడు తెలుగులో విడుదల కానుంది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ ను రాత్రి హైదరాబాద్, వైజాగ్ మరియు విజయవాడలో ఘనంగా స్టార్ట్ చేసారు. ప్రెస్ స్క్రీనింగ్ మరియు సెలబ్రిటీ ప్రీమియర్ నుండి అనూహ్య స్పందన ఈ సినిమాకి లభించింది. అందుకే నిర్మాతలు కొన్ని థియేటర్లలో పెయిడ్ ప్రీమియర్లను ఏర్పాటు చేశారు. ప్రీమియర్ బుకింగ్‌లు కూడా త్వరగా నిండిపోవడం మంచి శుభసూచకం. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాకు ఇప్పటికి భారీ కలెక్షన్లు వస్తున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఆకట్టుకుంటుందనీ, ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంటుందని, రానున్న రోజుల్లో ఈ సినిమా బుకింగ్స్ మరింతగా పెరుగుతాయని చిత్ర నిర్మాతలు భావిస్తున్నారు. 2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు