Friday, April 26, 2024

ఒడిశా రైలు ప్రమాదంపై సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి

తప్పక చదవండి

ఆంధ్రప్రదేశ్ , 03జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :

ఒడిశాలోని బాలాసోర్‌ సమీపంలో జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదంపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌. జగన్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

- Advertisement -

ఈ ఘటనలో 233 మందికిపైగా చనిపోయారని తాజా సమాచారం.

దీనిపై ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మృతులు, క్షతగాత్రుల్లో రాష్ట్రానికి చెందిన వ్యక్తులు ఉన్నారా? లేదా? అన్నదానిపై దృష్టిపెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రైల్వే అధికారులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని అధికారులు సీఎంకు తెలిపారు.

ఎలాంటి సహాయం కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉండాలని సీఎం అధికారులను ఆదేశించారు.

రైల్వే అధికారులనుంచి నిరంతరం సమాచారం తెప్పించుకోవాలన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు