- 84 శాతం మంది అభ్యర్థులు ఎంపిక..
- 1,79,459 మంది పరీక్ష రాశారు..
- 1,50,852 మంది క్వాలిఫై..
- ప్రకటించిన పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు..
హైదరాబాద్, 30 మే (ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ రాష్ట్రంలో నిర్వహించిన పోలీసు నియామక పరీక్ష ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్ఐ, కానిస్టేబుల్ పరీక్ష ఫలితాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. 84 శాతం మంది అభ్యర్థులు ఎంపిక అయినట్లు తెలంగాణ పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది. మొత్తం 1,79,459 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు తెలిపారు. 1,50,852 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు అధికారులు తెలిపారు.