Thursday, April 25, 2024

2 కిలో గంజాయి స్వాధీనం… యువకులు అరెస్ట్..

తప్పక చదవండి

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీనగర్ ఎస్ఓటి పోలీసులు దాడులు చేసి 2 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రాంపల్లిలోని బీరప్ప గుడి సమీపంలో గుట్టు చప్పుడు కాకుండా గంజాయి అమ్ముతున్నట్లు పక్కా సమాచారం అందుకున్న పోలీసులు..దాడులు చేసి 2 కిలోల గంజాయి, ఓ బైక్ , 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. లక్ష ఉంటుందని పోలీసులు తెలిపారు.లోకేష్, సాయి శంకర్, మధు మోహన్, కిరణ్ మోహన్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు