Friday, March 29, 2024

మరోసారి నిర్మాతగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్..

తప్పక చదవండి
  • గ్లోబల్ స్టార్ గా మారిన తరువాత మొదటిసారి..
  • యూవీ క్రియేషన్స్ తో కలిసి సినిమా నిర్మాణం..

ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో గ్లోబర్‌ స్టార్‌గా మారిపోయాడు రాంచరణ్‌. ఇప్పటికే స్టార్ హీరోగా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న రాంచరణ్‌ నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. రాంచరణ్‌ హోం బ్యానర్‌ వీ మెగా పిక్చర్స్‌లో తన స్నేహితుడు యూవీ క్రియేషన్స్‌ విక్రమ్‌ తో కలిసి కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించనున్నాడు. చిన్న వెబ్‌ సిరీస్‌ల నుంచి పాన్ ఇండియా సినిమాల వరకు యూనిక్‌, ఎంటర్‌టైనింగ్ కంటెంట్‌ను నిర్మించబోతున్నారని సమాచారం. రాంచరణ్‌-విక్రమ్‌ ఫిలిం డిస్ట్రిబ్యూషన్‌లో కూడా భాగస్వామ్యం కాబోతున్నారట. రాంచరణ్‌ రానున్న రోజుల్లో కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించాలని ఆకాంక్షిస్తున్నారు ఫాలోవర్లు, అభిమానులు. ప్రస్తుతం రాంచరణ్‌ తో స్టార్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో గేమ్‌ ఛేంజర్‌ సినిమా చేస్తున్నాడు. ఆర్‌సీ 15 ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. బాలీవుడ్ భామ కియారా అద్వానీ ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తోంది.

పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్‌లో రాజోలు భామ అంజ‌లి, శ్రీకాంత్‌, స‌ముద్రఖని, న‌వీన్ చంద్ర‌, జ‌య‌రాయ్‌, సునీల్ ఇత‌ర కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌ రాజు అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. రాంచరణ్‌ మరోవైపు ఉప్పెన ఫేం బుచ్చిబాబు సాన డైరెక్షన్‌లో రూరల్ యాక్షన్‌ డ్రామాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆర్‌సీ 16గా రాబోతున్న ఈ మూవీ షూటింగ్‌ గేమ్‌ ఛేంజర్‌ పూర్తయిన తర్వాత షురూ కానుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు