Wednesday, April 24, 2024

వాట్సాప్‌ వింటోందా..?

తప్పక చదవండి
  • వాట్సాప్‌పై ట్విట్టర్ ఉద్యోగి ట్వీట్..
  • సోషల్ మీడియాలో రచ్చ రచ్చ..
  • సీరియస్ గా తీసుకుని స్పందించిన కేంద్రం.. !

న్యూ ఢిల్లీ, 10 మే ( ఆదాబ్ హైదరాబాద్ ) :
కోట్లాది మంది వాడే ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్‌పై సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ యాప్ వాడని సమయంలో బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్ పనిచేస్తుందంటూ ట్విట్టర్‌లో పనిచేసేటువంటి ఒక ఉద్యోగి ఒక ట్వీట్ చేయగా.. ఇది ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై తెగ చర్చ జరుగుతోంది. దానికి సంబంధించిన ఒక స్క్రీన్‌షాట్ షేర్ చేయగా వైరల్ అయింది. దీంతోనే ఈ యాప్ నమ్మదగినది కాదంటూ స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ట్వీట్ చేయగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించింది. వాట్సాప్‌పై వచ్చిన ఆరోపణల్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ .. భారత ప్రభుత్వం తరఫున స్పందించారు.

ట్విట్టర్‌లో పనిచేస్తున్న ఫోడ్ డబ్రి అనే ఒక ఇంజినీర్ ఉద్యోగి ట్వీట్‌తో ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. ‘నేను నిద్రపోతుంటే ఆ టైంలో వాట్సాప్ బ్యాక్‌గ్రౌండ్‌లో మైక్రోఫోన్ ఉపయోగిస్తుంది. ఉదయం లేవగానే నా ఫోన్ చూసి ఆశ్చర్యపోయా.’ అని తన ఆండ్రాయిడ్ డాష్‌బోర్డ్ స్క్రీన్ షాట్‌ను ట్విట్టర్‌లో షేర్ చేశారు. అసలేం జరుగుతోందంటూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ దీనిపై స్పందించారు. వాట్సాప్ నమ్మదగే యాప్ కాదంటూ పేర్కొన్నారు. దీంతోనే ఈ ఇష్యూ మరింత పెద్దదైంది. వాట్సాప్‌పై వచ్చిన ఆరోపణలపై ఐటీ మంత్రి రాజీవ్ స్పందించారు. యూజర్ల గోప్యతకు సంబంధించిన ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు కూడా సిద్ధమవుతుందని ఈ సందర్భంగా చెప్పారు మంత్రి. గత సంవత్సరం అక్టోబర్‌లో వాట్సాప్ సర్వీసులు 2 గంటల పాటు నిలిచిపోయిన సమయంలోనూ భారత్ స్పందించింది. వాట్సాప్ ఎందుకు ఆగిపోయింది.. దానికి కారణాలు తెలియజేయాలంటూ వాట్సాప్ నుంచి వివరణ కూడా కోరింది. భారత యూజర్లను అంతర్జాతీయ కాల్స్ వేధిస్తున్న సమయంలో ఈ వ్యవహారం తెరపైకి రావడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో ట్వీట్లు హల్‌చల్ చేస్తున్న సమయంలో వాట్సాప్ కూడా దీనిపై స్పందించింది. మైక్రోఫోన్ అంశంపై జరుగుతున్న ప్రచారాన్ని తోసిపుచ్చింది. ఆండ్రాయిడ్‌లో ఉన్న బగ్ కారణంతోనే డ్యాష్‌బోర్డులో అలా తప్పుడు సమాచారం చూపిస్తుందని పేర్కొంది. ఫిర్యాదు చేసిన యూజర్.. గూగుల్ పిక్సెల్ ఫోన్ వాడుతున్నారని, దీనిపై విచారణ జరపాలని గూగుల్‌ను కోరినట్లు పేర్కొంది. మైక్రోఫోన్ సెట్టింగ్స్‌పై పూర్తి నియంత్రణ యూజర్ల చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఆ యూజర్ వాయిస్, వీడియో రికార్డింగ్ చేసినప్పుడే మైక్రోఫోన్ పనిచేస్తుందని వివరణ ఇచ్చింది. ఇక ఈ సంభాషణలు కూడా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందన, వాట్సాప్ వేటిని కూడా వినదంటూ పెద్ద ట్వీట్ చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు